విజయనగరంలో వందేళ్ల చరిత్ర ఉన్న మహారాజ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో సద్గురు శ్రీ త్యాగరాజ ఆరాదనోత్సవం జరిగింది. కళాశాల కు సంక్రాంతి శెలవు లు ఇచ్చినప్పటికీ అకస్మాత్తుగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అప్పటికప్పుడు కళాశాల ప్రిన్సిపాల్ ప్రసన్న కుమారీ ,సూపరింటెండెంట్ ప్రసాద్ లు హాడావుడిగా….కళాశాల అధ్యాపకులతో పాటు స్టూడెంట్స్ కబుర్లు ,సమాచారం ఇప్పించి…
కేవలం రెండే రెండు గంటలలో కళాశాల లో ఉత్సవం…ఉత్సాహవంతంగా ఏర్పాటు చేశారు. దీంతో ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ సూచనలను తు.చ తప్పకుండా కళాశాల మేనేజ్మెంట్ పాటించారు.ఇక సద్గురు శ్రీ త్యాగరాజ ఆరాధనా ఉత్సవంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రసన్న కుమారీ ,అన్నపూర్ణ, జయలక్ష్మి అలాగే సీనియర్ విద్యార్థులు… సుభద్రాదేవి… తదితర విద్యార్ధినీ విద్యార్థులు త్యాగరాజ కీర్తలను ఆలపించారు.