33.7 C
Hyderabad
April 29, 2024 00: 56 AM
Slider మహబూబ్ నగర్

వర్గీకరణపై నిర్లక్ష్యం వహిస్తే బీజేపీని అడ్డుకుంటాం

#bandi

షెడ్యూలు కులాల వర్గీకరణ మీద నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తే బిజెపికి తగిన విధంగా రాజకీయ సమాధానమిస్తామని MRPS జాతీయ ప్రధాన కార్యదర్శి కోళ్ళ శివ మాదిగ హచ్చరించారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గ కేంద్రంలో జరిగిన బీజేపీ సభలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి ఈ మేరకు ఆయన స్పష్టం చేశారు. భారత దేశంలో మెజార్టీ జనాభాకు విరుద్ధంగా ఉన్న చట్టాలను పార్లమెంటులో చట్టబద్ధత కల్పిస్తున్న బిజెపి షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ మీద నిర్లక్ష్య వహించడం దుర్మార్గమేనని ఆయన అన్నారు.

తెలంగాణకు ప్రధాని మోడీ వచ్చేలోగా షెడ్యూల్ కులాల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించే అంశంలో బిజెపి తన స్పష్టమైన వైఖరిని వెల్లడించాలని లేదంటే తెలంగాణలో మోడీ పర్యటన అడ్డుకుంటామని ఆయన తెలిపారు. షెడ్యూల్ కులాల వర్గీకరణకు చట్ట బద్దత కల్పించకుండా ఆలస్యం చేయడం అంటే మాదిగల ఎదుగుదలకు  ద్రోహం చేయడమేనని ఆయన అన్నారు. బిజెపి బీసీ ల కుల గణన చేయకుండా SC వర్గీకరణ కు చట్ట బద్దత కల్పించకుండా మెజారిటీ వర్గాల ప్రజలకు సామాజిక ద్రోహం చేస్తుందని ఆయన అన్నారు.

Related posts

కుప్పం టీడీపీ నేత త్రిలోక్ కు చంద్రబాబు పరామర్శ

Satyam NEWS

కర్నూలు వచ్చి కరోనాతో సహజీవనం చేయండి

Satyam NEWS

ఎక్సైజ్ శాఖ అధికారులపై ఏసీబీ దాడులు

Satyam NEWS

Leave a Comment