34.2 C
Hyderabad
May 10, 2024 12: 47 PM
Slider ముఖ్యంశాలు

వైభవంగా సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌  జయంతి వేడుక

#sarvaipapanna

బహుజన విప్లవ వీరుడు సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ 371 వ జయంతి వేడుకలను  మేడ్చల్‌ జిల్లా ఉప్పల్‌ నియోజకవర్గం  కుషాయగూడలోని గౌడ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం వైభవంగా నిర్వహిచారు. కుషాయగూడలోని కల్లు కాంపౌండ్‌ యందు సర్దార్‌ సర్వాయిపాపన్న గౌడ్‌ జయంతి వేడుకలను ముఖ్యఅతిధులు గా తెలంగాణ తాడి టాపింగ్‌ ఇండస్ట్రీస్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ అధ్యక్షులు లింగాల గోవర్ధన్‌ గౌడ్‌ ,అఖిలభారత గౌడసంఘం కల్లు గీత సమాఖ్య కన్వీనర్‌ ఈశ్వరప్రసాద్‌గౌడ్‌ లు పాల్గొని సర్వాయి పాపన్న గౌడ్‌ చిప్రటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమం నిర్వహకులు తాళ్ళ వెంకటేశ్‌ ఆధ్వర్యలో జరిగింది,  ఈ సందర్భంగా వారు మాట్లాడతూ   పాలకుల అణచివేత, దోపిడీలపై మామూలు మద్యతరగతి ప్రజలు కూడా తిరుగుబాటు చేసి రాజ్యాధికారం చేజిక్కుంచుకోవటానికి  సర్ధార్‌ సర్వాయిపాపన్న  అందరికి స్పూర్తిదాయకమని అన్నారు. గౌడసోదరులంతా రాజ్యాధికారం లక్ష్యంగా పనిచేయాలని పలుపునిచ్చారు.  అణగారిన బహుజన గౌడజాతిలో జన్మించి మొగలులకు వ్యతిరేకంగా గోల్కొండ ఖిల్లాపై జెండాను ఎగరవేసిన సర్ధార్‌ పాపన్నగౌడ్‌ ఆశయాలను స్పూర్తిగా తీసుకొని నేటి యువత కృషి చేయాలనిపిలుపునిచ్చారు. 

సామాన్య గౌడ కులం నుండి బహుజన వర్గాల ఆత్మవిశ్వాస ప్రతీకగా ఎదిగిన పాపన్న జయంతి వేడుకలను  ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని వారు డిమాండ్‌చేశారు. కార్యక్రమంలో ఆనంద్‌గౌడ్‌, రఘుపతిగౌడ్‌, గౌడ సంఘం సభ్యులు పాండల శివకుమార్‌గౌడ్‌, సుధీర్‌కుమార్‌గౌడ్‌, తండా బాలరాజ్‌గౌడ్‌, కాసుల శ్రీకాంత్‌గౌడ్‌, కేసరి సత్యనారాయణగౌడ్‌, చింతల విష్ణుగౌడ్‌, మరియు కుషాయగూడ గౌడ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

సినీ కార్మికులకు అండగా నేనున్నాను

Bhavani

ములుగు ప్రాంతంలో ఎమ్మెల్యే సీతక్క పర్యటన

Satyam NEWS

ప్రకృతి పగబట్టిందని పంటకు నిప్పు పెట్టుకున్న రైతులు

Satyam NEWS

Leave a Comment