39.2 C
Hyderabad
May 3, 2024 15: 00 PM
Slider ఆదిలాబాద్

సమత అత్యాచారం కేసులో ఎదురుతిరిగిన నిందితులు

samatha

కొమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో కలకలం రేపిన ‘సమత’ అత్యాచారం, హత్య కేసులో ఆదిలాబాద్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ ప్రారంభమైంది. నిందితులు షేక్‌ బాబు, షేక్‌ షాబుద్దీన్‌, షేక్‌ ముగ్దుంలను కోర్టు విచారించింది. వారు ఈ నేరాన్ని అంగీకరించలేదు. పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేశారని కోర్టుకు తెలిపారు. సమత నిందితులపై కోర్టు నేరారోపణ అభియోగాలు ఖరారు చేసింది.

నిందితుల తరఫున న్యాయవాది రహీం కోర్టులో డిశ్చార్జి పిటిషన్ వేశారు. నిందితులతో మాట్లాడేందుకు న్యాయవాదికి న్యాయస్థానం అనుమతించింది. అనంతరం ఈ కేసును రేపటికి వాయిదా వేసింది. లింగాపూర్ మండలం ఎల్లపటార్‌లో సమతపై కొందరు మృగాళ్లు అత్యాచారం చేసి, దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే.

Related posts

మంత్రి వేముల సమక్షంలో బిజెపి నుండి టిఆర్ఎస్ లో చేరిక

Bhavani

అయ్యప్ప భక్తులకు అనీల్ కుమార్ క్షమాపణ చెప్పాలి

Satyam NEWS

టీడీపీలో చేరిన వైకాపా కీలక నేత వేమిరెడ్డి

Satyam NEWS

Leave a Comment