కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కలకలం రేపిన ‘సమత’ అత్యాచారం, హత్య కేసులో ఆదిలాబాద్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ ప్రారంభమైంది. నిందితులు షేక్ బాబు, షేక్ షాబుద్దీన్, షేక్ ముగ్దుంలను కోర్టు విచారించింది. వారు ఈ నేరాన్ని అంగీకరించలేదు. పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేశారని కోర్టుకు తెలిపారు. సమత నిందితులపై కోర్టు నేరారోపణ అభియోగాలు ఖరారు చేసింది.
నిందితుల తరఫున న్యాయవాది రహీం కోర్టులో డిశ్చార్జి పిటిషన్ వేశారు. నిందితులతో మాట్లాడేందుకు న్యాయవాదికి న్యాయస్థానం అనుమతించింది. అనంతరం ఈ కేసును రేపటికి వాయిదా వేసింది. లింగాపూర్ మండలం ఎల్లపటార్లో సమతపై కొందరు మృగాళ్లు అత్యాచారం చేసి, దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే.