మేడారం సమ్మక్క సారక్క ట్రస్ట్ బోర్డు చైర్మన్ అలం రామమూర్తి అకాల మరణం పాలయ్యారు.
రామమూర్తి అకస్మాత్తుగా మృతి చెందడం బాధాకరమని ములుగు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బడె నాగజ్యోతి, తుమ్మల హరిబాబు, రుద్రమదేవి, సకినాల భవాని ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి పులా మాల వేసి మౌనం పాటించి నివాళి అర్పించారు.
ములుగు జిల్లా తాడ్వాయి మండలం స్వగ్రామం మేడారం లో ఆయన కుటుంబ సభ్యులును పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి సంతాపం తెలియజేశారు.
ములుగు జిల్లా ప్రజలు మంచి ఆదివాసీ నాయకులు, తెలంగాణ రాష్ట్ర స్వరాష్ట్ర ఉద్యమకారులు కోల్పోయాం అని, వారి ఆశయాలను నెరవేర్చాల పని చేస్తామని ఈ సందర్భంగా నాయకులు అన్నారు.