జగిత్యాల పట్టణంలో ఇసుక స్టాక్ యార్డు ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గనుల శాఖ ఏర్పాటు చేసిన ఈ ఇసుక స్టాక్ యార్డు ను థరూర్ క్యాంపులో కోదండ రామాలయం దగ్గర ఏర్పాటు చేశారు. ఈ ఇసుక స్టాక్ యార్డు ను ఎమ్మెల్యే సంజయ్ కుమార్ , జెడ్పి చేర్మన్ దావ వసంత ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో మైనింగ్ అధికారులు, తెరాస నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గనుల శాఖ( TS MDC – SAND Sub Stock Yard) వారి ఇసుక స్టాక్ యార్డు తో స్థానికంగా ఇసుక సమస్యలు తీరతాయని భావిస్తున్నారు.