సూర్యాపేట జిల్లా తిరుమలగిరి పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో పారిశుద్ధ్య వాహనాలను, 13వ వార్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ఎం ఎం సూపర్ మార్కెట్ ను వ్యవసాయ మార్కెట్ అవరణలో పి ఎ సి ఎస్ ఆధ్వర్యంలో ఎరువుల కొనుగోలు కేంద్రాన్ని శనివారం నాడు తుంగతుర్తి శాసన సభ్యులు గాదరి కిషోర్ కుమార్ ప్రారంభించారు.
అనంతరం తిరుమలగిరి మండలం తొండ గ్రామంలో రూ.35 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తిరుమలగిరి మున్సిపల్ చైర్మన్ పోతరాజు రజనీ రాజశేఖర్ వైస్ చైర్మన్ సంకేపల్లి రఘునందన్ రెడ్డి కమిషనర్ దండు శ్రీనివాస్ ఎంపీపీ నెమరుగోమ్ముల స్నేహలత సర్పంచ్ నెమరుగోమ్ముల శాతవాహనరావు తో పాటు పలువురు టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.