రెండో విడత దళిత బంధు నిధుల కోసం దరఖాస్తు చేసుకుని ఎనిమిది నెలలు గడుస్తున్నా ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయలేదని మాదిగ దండోరా నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు డీకే మాదిగ అన్నారు. తక్షణమే దళిత బంధు నిధులను విడుదల చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఆయన విజ్ఞప్తి చేశారు. నిధులు విడుదల చేయకపోవడం వల్ల సోషల్ మీడియాలో లేని పోనీ రాతలు వస్తున్నాయని, ప్రతిపక్ష పార్టీలు కూడా బీఆర్ఎస్ ను టార్గెట్ చేసుకొని విమర్శలు గుప్పిస్తున్నాయని ఆయన అన్నారు. అందుకోసమే త్వరితగతిన నిధులు విడుదల చేస్తే ముఖ్యమంత్రికే మంచి పేరు వస్తుందని ఆయన తెలిపారు. ఎమ్మెల్యేల ఇండ్ల చుట్టూ దళిత బంధు రెండో విడత దరఖాస్తుదారులు చెప్పులరిగేలా తిరుగుతున్నారని ఆయన అన్నారు. అలాగే నిరుపేదలైన దళితులకు 50 గజాల స్థలం ఉంటే మూడు లక్షల రూపాయలు రుణ సాయం చేస్తానని ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా గృహలక్ష్మి పథకం కింద నాలుగు లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేస్తానని చెప్పినందుకు కూడ ధన్యవాదాలు తెలిపారు.
previous post