వనపర్తి జిల్లా ఘనపురం మండలంలో గ్రామాలను గంజాయి రహిత గ్రామాలుగా మారాలని,డ్రగ్స్ వద్దు,ఆరోగ్యం ముద్దు అని వనపర్తి డిఎస్పీ కెఎం.కిరణ్ కుమార్ చెప్పారు. ఘనపురంలో ఎస్ఐ వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పీ కిరణ్ కుమార్, ఎస్ఐ వెంకటేష్ గౌడ్ ప్రసంగిస్తూ గ్రామాల్లో మత్తు పదార్థాలు, గంజాయికి దూరంగా ఉండాలని సూచించారు. గంజాయి, మత్తు గురించి సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరారు. ఈ సందర్భంగా సదస్సులో అందరి చేత ప్రమాణం చేయించారు. ఈ సమావేశంలో ఎంపిపి కృష్ణ నాయక్, నాయకులు,ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్