సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణం లోని వయసు ముత్యాలమ్మ గుడి దగ్గర ఉన్న యు పి ఎస్ నెంబర్ వన్ స్కూల్ లోతరగతి గదుల కొరత ఉంది. ఉన్న తరగతి గదులు కాస్తా శిథిలావస్థకు చేరుకొని ఉపయోగం లేకుండా నిరుపయోగమైపోతున్నాయి.
దీని కారణంగా విద్యార్థిని, విద్యార్థులకు విద్యాభ్యాసానికి ఆటంకాలు కలుగుతున్నాయి. శిధిలావస్థకు చేరిన తరగతి గదులను స్థానిక మున్సిపల్ చైర్మన్ గెల్లి అర్చన రవి, మున్సిపల్ వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరావు, మరియు ఎంపీపీ గూడెపు శ్రీను పరిశీలించారు. వీరి వెంట ప్రధాన ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.