29.7 C
Hyderabad
May 2, 2024 05: 45 AM
Slider నిజామాబాద్

సమష్టి కృష్టితో కరోనాను ఎదుర్కొందాం

#Eetala Rajendar

సమష్టి కృష్టితో కరోనా మహమ్మరిని ఎదుర్కొందామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సత్య గార్డెన్లో జిల్లా వైద్యాధికారులతో మంత్రి ఈటల రాజేందర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. వైద్యులు, అధికారుల నుంచి సలహాలు స్వీకరించారు.

ఈ సందర్బంగా జిల్లాలో 11 మంది ల్యాబ్ టెక్నీషియన్స్, 5 ఫార్మసీస్ట్స్, 68 ఎంపీహెచ్ఎస్ మహిళ సిబ్బందిని మంజూరు చేయాలని, అలాగే సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ ఏర్పాటు చేయాలని, మాత శిశు సంరక్షణ ఆస్పత్రికి 5 కోట్లు మంజూరు చేయాలని  జిల్లా కలెక్టర్ శరత్ కుమార్ మంత్రిని కోరారు. అలాగే జిల్లాలోని దోమకొండ, బాన్సువాడ, ఎల్లారెడ్డి ఆస్పత్రులకు ఆక్సిజన్ సౌకర్యం కల్పించాలని, ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో అంబులెన్స్ చెడిపోయిందని, అదనంగా అంబులెన్స్ సౌకర్యం కల్పించాలని వైద్యులు కోరారు.

బాన్సువాడలో ఔట్ సోర్సింగ్ వైద్యులను రెగ్యులర్ చేయాలి, వారికి వేతనాలు పెండింగులో ఉంటున్నాయని తెలిపారు. ప్రభుత్వ క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటు చేస్తే కోవిడ్ బాధితులకు సౌకర్యంగా ఉంటుందని, ఇళ్లలో వసతులు లేక అనేక మంది ఇబ్బంది పడుతున్నారని మంత్రిని కోరారు.

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. కరోనా నివారణ కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. కరోనా బాధితులకు సేవలు అందించడంలో వైద్యుల పాత్ర ఎనలేనిదని చెప్పారు. జిల్లాలో వైద్యుల సమస్యలను తెలుసుకోవడానికి సమీక్షలు నిర్వహిస్తున్నామని, కరోనాకు సీజనల్ వ్యాధులు కూడా తొడవుతున్నాయన్నారు.

ఐసీఎంఆర్ సూచనలు పాటిస్తున్నాం

ప్రపంచ వైద్య ఆరోగ్య సంస్థ, ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ పాటిస్తూ ముందుకు సాగుతున్నామని మంత్రి చెప్పారు. వైరస్ బారిన పడిన వారికి వెయ్యికి మించి ఖర్చు కాదని, వైరస్ తీవ్రత ఉండి ఆస్పత్రికి వెళ్తేనే ఖర్చవుతుందని తెలిపారు. రాష్ట్రంలో ర్యాపిడ్ టెస్టుల సంఖ్య పెంచడం జరిగిందని, అన్ని ఆస్పత్రులకు ర్యాపిడ్ కిట్లను పంపించామన్నారు.

వైరస్ బారిన పడిన వారిని హోం ఐసోలేషన్ పంపే ముందు ఇంట్లో ఉన్నవారి పూర్తి వివరాలు పూర్తిగా తెలుసుకోవాలని సూచించారు. అనస్థీషియా వైద్యులు ఉంటే ఏర్పాటు చేసుకోవాలని, అవసరం ఉన్నచోట ఆక్సిజన్, వెంటిలేటర్ సౌకర్యం కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. సిబ్బంది వేతనాలు పూర్తిగా చెల్లిస్తామని హామీ ఇచ్చారు.

దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు కరోనా బారిన పడి మృతి చెందుతున్నారని, వారందరినీ కోవిడ్ బాధితులుగా లెక్క కట్టాలని చెప్పడం సరికాదన్నారు.

బాద్యతరహితంగా మాట్లాడుతున్నారు

ప్రతిపక్షాలు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నాయని మంత్రి ఈటల విమర్శించారు. ప్రాణాలను పణంగా పెట్టి సేవలందిస్తున్న వైద్యుల పట్ల హేళన చేస్తూ మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో వైద్యులు మనోధైర్యంతో పని చేయాలని, వైద్యులకు ఎలాంటి వసతులు కావాలన్నా సమకూర్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎంపీ బిబిపాటిల్, ఎమ్మెల్యేలు హన్మంత్ షిండే, జాజాల సురేందర్, జడ్పీ చైర్మన్ దఫెదర్ శోభ, కలెక్టర్ శరత్ కుమార్, డిఎంఈ రమేష్ రెడ్డి, కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ జాహ్నవి, అధికారులు, వైద్యులు పాల్గొన్నారు.

Related posts

కేసుల్ని పక్కదోవ పట్టించే స్ట్రాటజీ

Satyam NEWS

U turn: రాజధాని అమరావతి కోసం ఉద్యమం చేస్తాం

Satyam NEWS

కడప జిల్లాలో కొత్తగా మరో 39 కంటైన్మెంట్ జోన్లు

Satyam NEWS

Leave a Comment