శ్రీకాకుళం గ్రామీణ మండలం పెద్దపాడు గ్రామంలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలను బుధవారం ఉదయం శ్రీకాకుళం జిల్లా విద్యాశాఖ అధికారి కే చంద్రకళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో ఆమె పాఠశాల రికార్డులను పరిశీలించారు. విద్యార్థుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అమ్మ ఒడి వివరాలను, భోజనం పథకం నిర్వహణ వివరాలను కూడా తనిఖీ చేశారు.
అనంతరం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మక్కా శ్రీనివాసరావుతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పొట్నూరు ఝాన్సీతో కూడా మాట్లాడారు. చివరగా ఉపాధ్యాయులు తో ముఖాముఖి మాట్లాడారు. ఈ తనిఖీలో ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు సత్యవతి, శాంతారావు, భూషణ రావు, మల్లేశ్వరి, కృష్ణారావు, సురేష్ కుమార్, మోహన్, సూర్యనారాయణ, సన్యాసి నాయుడు, నీలిమ, రవి బాబు పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.