ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి, మాజీ మంత్రి వై ఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కు సంబంధించి కడప ఎంపి, ముఖ్యమంత్రి సోదరుడు అయిన అవినాష్ రెడ్డికి సీబీఐ మరో నోటీసు జారీ చేసింది. తొలి నోటీసుకు అవినాష్ రెడ్డి స్పందిస్తూ ముందు ఏర్పాటు చేసుకున్న కార్యక్రమాల మేరకు తాను విచారణకు హాజరు కాలేనని చెప్పారు.
దాంతో సీబీఐ రెండోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 28న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. దరాబాద్లోని సీబీఐ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. దాదాపు రెండున్నరేళ్లుగా కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ ఇప్పటివరకూ ఒక్కసారి కూడా ఆయనను ప్రశ్నించలేదు. కడప నుంచి హైదరాబాద్కు కేసు బదిలీ అయిన తర్వాత తాజాగా విచారణ మొదలుపెట్టిన సీబీఐ అవినాష్ రెడ్డికి నోటీసులిచ్చింది.