అక్రమంగా నిల్వ చేసి, బ్లాక్లో అధిక ధరలకు విక్రయిస్తున్న గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు గద్వాల జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి రేవతి తెలిపారు. సివిల్ సప్లయ్ శాఖ డీటి కేశవ్ ఆధ్వర్యంలో సివిల్ సప్లయ్ అధికారులు కేటిదొడ్డి మండల కేంద్రంలోని ఓ ఇంట్లో సోదాలు నిర్వహించగా అక్రమంగా నిల్వ ఉంచిన 10 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు.
అక్రమ నిల్వలపై అధికారులకు అందిన సమాచారం మేరకు ఈ దాడులు నిర్వహించారు. ఒకో సిలిండర్ బ్లాక్లో రూ.1280కు విక్రయిస్తున్నారని ఫిర్యాదు మేరకు దాడులు నిర్వహించి సీజ్ చేసినట్లు డీఎస్ఓ రేవతి తెలిపారు. ఈ దాడులో డీటి కేశవ్, తదితరులు పాల్గొన్నారు.