కరోన నుంచి సురక్షితంగా ఉండాలంటే బయట తిరగవద్దని అంబర్ పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కోరారు. నేడు ఆయన అంబర్ పేట్ నియోజకవర్గం గోల్నాక డివిజన్లలోని తులసి నగర్, శాంతి నగర్, జిందాతిల్సుమాత్, తదితర ప్రాంతాల్లో పాదయాత్ర నిర్వహించారు.
కరోన వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజలకు కరపత్రాలు అందజేస్తు క్రిమిసంహారక మందులను అన్ని ప్రాంతాలలో స్ప్రే చేయించారు. ఇంట్లో నుంచి బయటకు ఎవరూ రావద్దని ఈ సందర్భంగా ఆయన కోరారు. బయటకు వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసి ఎంటామాలజి ఫిల్డ్ అసిస్టెంట్ వెంకటయ్య, సిబ్బంది , టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.