42.2 C
Hyderabad
May 3, 2024 17: 34 PM
Slider మహబూబ్ నగర్

శనీశ్వర స్వామికి తిల తైల అభిషేక పూజలు

#bjinepalli

నాగర్ కర్నూల్ జిల్లా బిజినెపల్లి మండలంలోని నంది వడ్డేమాన్ గ్రామంలో శనివారం శ్రీ సార్థా సప్త జేష్ట మాత సమేత శనేశ్వర స్వామికి చైత్రమాసం బహుళ విదియ శనివారంనాడు ఉండటంతో స్వామి వారికి ప్రత్యేకంగా తిలా తైలా అభిషేక పూజలు నిర్వహించారు.ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ గవ్వమఠం విశ్వనాథ శాస్త్రి మాట్లాడుతూ భక్తుల జన్మ రిత్యా, గోచార రీత్యా గ్రహదోషాలు తొలగుటకు, శని గ్రహ శాంతి కొరకు శనేశ్వర స్వామికి తిల తైల అభిషేకాలు, బ్రహ్మ సూత్రం గల నందీశ్వర పరమశివునికి రుద్రాభిషేకపూజలు,అర్చనలు ప్రత్యేకంగా  నిర్వహించినట్లు ఆయన తెలిపారు.అనంతరం మహా గణపతి స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. వివిద ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తెల్ల వారు జమున నుండి స్వామివారికి ప్రత్యేకంగా అభిషేకాలు,అష్టోత్తర, అర్చనలు పూజలు చేశారు. ఈ కార్యక్రమంలోఆలయ చైర్మన్ గోపాలరావు, కమిటీ సభ్యులు,వీరాశేకర్, ప్రభాకర్,పుల్లయ్య, సర్పంచ్ వంగ సుదర్శన్ గౌడ్,ఆలయఆర్చకులు గవ్వమఠం శాంతి కుమార్, ఉమ్మయ్య,జయంత్, సిబ్బంది గోపాల్ రెడ్డి భక్తులు, మహిళలు అధిక సంఖ్యలోపాల్గొన్నారు.

Related posts

క‌రోనా టీకాలు వేయించుకున్న జిల్లా ఉన్నతాధికారులు

Satyam NEWS

జులై 22న ‘మీలో ఒకడు’ చిత్రం గ్రాండ్  రిలీజ్

Satyam NEWS

కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్

Bhavani

Leave a Comment