29.7 C
Hyderabad
April 29, 2024 08: 09 AM
Slider నల్గొండ

మున్నూరు కాపులు రాజ్యాధికారం సాధించాలి

#munnurukapu

మున్నూరు కాపు సంఘం శ్రీకృష్ణదేవరాయ నిత్య అన్నదాన సత్ర కమిటీ సమావేశం

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం పరమ పవిత్రమైన ఉత్తర వాహిని కృష్ణా నది తీరాన శ్రీ లక్ష్మీనృసింహ స్వామి స్వయంభువుగా వెలసి భక్తులచే విరాజిల్లుతున్న మట్టపల్లి మహా క్షేత్రం లోని మున్నూరు కాపు సంఘం శ్రీకృష్ణదేవరాయ నిత్య అన్నదాన సత్ర కమిటీ సమావేశం శనివారం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్నూరు కాపు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైద్యం వెంకటేశ్వర్లు,రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆవుల రామారావు, సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు పుట్టా కిషోర్, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు కోల నాగేశ్వరరావు హాజరయ్యారు. 

ఈ సందర్భంగా శ్రీకృష్ణదేవరాయ నిత్యాన్నదాన సూత్రానికి అడహక్ కమిటీని ఎన్నుకున్నారు.కన్వీనర్ గా తోట వెంకయ్య నాయుడు( హైదరాబాద్) కో – కన్వీనర్ గా ఆకుల నాగేశ్వరరావు( గుంటూరు జిల్లా)అడహక్ కమిటీ డైరెక్టర్లుగా పుట్టా కిషోర్ మ,నున్న జనార్ధన్ రావు, కోలా నాగేశ్వరరావు,రామిశెట్టి అప్పారావు,గంధం రామచంద్రయ్య, రామిశెట్టి విజయ మాధవి,కడియాల అప్పయ్య,గోపిశెట్టి తిరుపతి వెంకయ్య, గంధం రామచంద్రయ్య,కూరాకుల సాంబయ్య,పాడి కాశయ్య, మకిలారు కాశిలను ఎన్నుకున్నారు.గౌరవ సలహాదారులుగా పాలేటి రామారావు,బజ్జురి నారాయణస్వామి, పొట్ట జగన్మోహన్ రావు,యాదగిరి కోటయ్య,ఆకుల రాము లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మున్నూరు కాపు సంఘం అభివృద్ధి కోసం సత్ర నిర్మాణానికి నిరంతరం కృషి చేయాలని నూతన కమిటీ కోరారు. మట్టపల్లి క్షేత్రంలో వైశాఖ పూర్ణిమ సందర్భంగా జరిగే శ్రీ లక్ష్మీనృసింహ స్వామి వారి కళ్యాణ బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసేందుకు సంఘం సోదరులంతా సహాయ సహకారాలు అందించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మున్నూరు  కాపు సంఘం రాష్ట్ర కార్యదర్శి దంతాల రాంబాబు,మట్టపల్లి సర్పంచ్ దాసరి వెంకటరమణ,కనగాల శ్రీనివాసు, అచ్యుతరావు, కంబాల రామయ్య,కంబాల మురళి,పాడి రామకోటయ్య,సత్యం, సుబ్బయ్య,నల్గొండ జిల్లా కాపు సంఘం అధ్యక్షుడు వెంకట నరసయ్య పాల్గొన్నారు.

సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్

Related posts

మానవత్వమా నీ చిరునామా ఎక్కడ?

Satyam NEWS

మే 16 నుండి దోస్త్

Bhavani

పి వి ని మరచిపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

Satyam NEWS

Leave a Comment