మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అన్ని రంగాలలో కనిపిస్తున్న ఒత్తిడి నుండి కోలుకోవడానికి మూడు నుండి నాలుగు త్రైమాసికాలు వేచి ఉండాలి. అమెరికా, చైనా, ఇండియా, జపాన్లతో సహా ప్రపంచంలోని అగ్రదేశాల కరెన్సీలు, స్టాక్ మార్కెట్, బిట్కాయిన్తో సహా అన్ని ఇన్వెస్ట్మెంట్ సాధనాలు భారీగా పడిపోయాయి.
దీంతో ఇన్వెస్టర్లు భారీగా నష్టపోయారు. కొన్ని దేశాల్లో ద్రవ్యోల్బణం 40 ఏళ్ల గరిష్ట స్థాయికి కూడా చేరింది. అధిక చమురు ధరలు అగ్నికి ఆజ్యం పోస్తున్నాయి. దీన్ని అధిగమించేందుకు ప్రపంచవ్యాప్తంగా 21 కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచాయి. ఇది ప్రజల పొదుపుపై ప్రభావం చూపుతుంది.ఒక నెలలో డాలర్తో పోలిస్తే రూపాయి 1.67 శాతం నష్టపోయింది. ఈ కాలంలో, చైనీస్ యువాన్ 6.5%, జపనీస్ యెన్ 17.38%, యూరో 4.35% మరియు బ్రిటిష్ పౌండ్ 6.49% పడిపోయాయి.
డాలర్తో రూపాయి మారకం విలువ 94.4 స్థాయికి దిగజారవచ్చని అంతర్జాతీయ ద్రవ్య నిధి తెలిపింది.భారత నిఫ్టీ ఒక నెలలో 9.8% పడిపోయింది. చైనా 4.14%, జపాన్ 4.08%, యూరోపియన్ మార్కెట్లు 7.17%, అమెరికన్ డౌసన్స్ 6.97% క్షీణించాయి. భారత మార్కెట్ క్యాపిటల్ ఏప్రిల్ 11 నుంచి రూ.34 లక్షల కోట్లు క్షీణించింది.
ప్రపంచం మొత్తం ప్రస్తుతం ద్రవ్యోల్బణంతో పోరాడుతోంది. అమెరికాలో ద్రవ్యోల్బణం 40 ఏళ్ల గరిష్ట స్థాయి 8.3 శాతానికి చేరుకుంది. బ్రిటన్లో ఇది 30 ఏళ్ల గరిష్ట స్థాయి 7 శాతానికి చేరుకోగా, ఫ్రాన్స్లో 1990 నుంచి అత్యధికంగా 5.2 శాతానికి చేరుకుంది. భారతదేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం కూడా ఏప్రిల్లో 7.79 శాతానికి పెరిగింది, ఇది మే 2014 తర్వాత ఎనిమిదేళ్లలో అత్యధికం.