భారతీయ జనతా పార్టీ ములుగు జిల్లా కార్యాలయంలో బిజెపి ములుగు మండల అధ్యక్షులు ఇమ్మడి రాకేష్ యాదవ్, ములుగు జిల్లా కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు జింకల కృష్ణకర్ రావు ఆధ్వర్యంలో బంజారుపల్లి గ్రామానికి చెందిన వివిధ పార్టీ నాయకులు సుమారు 50 మంది బీజేపీ పార్టీ లో చేరారు. వీరికి బీజేపీ జిల్లా అధ్యక్షులు చింతలపూడి భాస్కర్ రెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలకు ఆకర్షితులై బీజేపీ పార్టీ సిద్ధాంతాలను నమ్మి బీజేపీ పార్టీ లో చేరాలనుకోవడం చాలా సంతోషాకరమని, రాబోయే రోజులలో ములుగు నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి గెలుపు కోసం ప్రతిఒక్కరు కృషి చెయ్యాలని పిలుపునిచ్చారు. కెసిఆర్ నిరంకుశ పాలనలో రాష్ట్రం వెనుకబడింది అని, వెనుకబడిన గిరిజన ప్రాంతామైన ములుగు జిల్లాలో అభివృద్ధి శూన్యం అని, ములుగు జిల్లా అభివృద్ధి పైన రాష్ట్ర ప్రభుత్వానికి గాని స్థానిక ఎమ్మెల్యే సీతక్క కు గాని చిత్తశుద్ధి లేదని వారు అన్నారు.
అభివృద్ధి చెయ్యడం చేతకాకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉపఎన్నికలకి వెళ్లాలని, రాష్ట్రంలో ఉపఎన్నికలు వస్తేనే అభివృద్ధి చేసే ధోరణిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని, ములుగు నియోజకవర్గ అభివృద్ధికై రాజీనామా చెయ్యాలని వారు డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో చేరిన యువకులు బండి రాజు పాండే, మహేందర్, కనకాల శ్రీనివాస్, కుమారస్వామి, రఘుపతి, హరీష్, సురేందర్, భద్రయ్య, అనిల్, సురేష్, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి నగరపు రమేష్, బిజెపి ములుగు జిల్లా అధికార ప్రతినిధి దొందిరెడ్డి వాసుదేవ రెడ్డి, ములుగు నియోజకవర్గ కన్వీనర్ సిరికొండ బలరాం, ములుగు జిల్లా BJYM అధ్యక్షుడు కొత్త సురేందర్, ములుగు జిల్లా OBC జిల్లా అధ్యక్షుడు రయకంటి పరమేశ్వర్, ములుగు జిల్లా BJYM కార్యదర్శి గుమ్మడిలి లక్ష్మణ్, వెంకటాపూర్ మండల అధ్యక్షుడు భూక్య జోహార్ లాల్, బిజెపి ములుగు మండల ప్రధాన కార్యదర్శి కోయిల కవిరాజ్, ములుగు మండల ఉపాధ్యక్షుడు గొంగల కటయ్య, ములుగు మండల OBC అధ్యక్షుడు తైలం అశోక్ తదితరులు పాల్గొన్నారు.