కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రాజాపూడి గ్రామంలో సగర పేటకు చెందిన నంగన కిట్టమ్మ, చనుపోయిన బుల్లబ్బాయి, నంగన నరసింహమూర్తి, గజ్జల చిన్న వీర్రాజు, కర్నాటి చిన్న సత్యనారాయణ, నంగన వీరబాబు, ఆధ్వర్యంలో సగర కులానికి చెందిన మహిళలు, పురుషులు సుమారు 200మంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
వారికి నెహ్రూ తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా స్వాగతించారు. సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి ఇంత పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలోకి రావడం చాలా ఆనందదాయకమని చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోతో రాష్ట్ర ప్రజల అభివృద్ధి, సంక్షేమం అందరికీ అందుతుందని మహిళలకు పెద్దపీట వేస్తూ మహానాడు వేదికగా అనేక సంక్షేమ పథకాల రూపకల్పన చేశారని గతంలో రాజపుడి గ్రామంలో కోట్లాది రూపాయలతో సిమెంట్ రోడ్లు వేసాను.
ఈ ఎమ్మెల్యే గాని ఈ ప్రభుత్వం గానీ ఎక్కడైనా రోడ్లు వేశారని ఆఖరికి ఒక్క డ్రైవ్ కూడా నిర్మించలేదని మళ్లీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం గ్రామంలో డ్రైనేజీ అన్ని పూర్తి చేస్తాను. అని అన్నారు. జిల్లాలో సగర సోదరులందరికీ జగ్గంపేట కేంద్రంగా కమ్యూనిటీ భవన నిర్మిస్తానని హామీ ఇచ్చారు. ఈ ప్రభుత్వంలో కరెంట్ బిల్లు కట్టలేని పరిస్థితిలో ఉన్నారని తొందరలోనే చంద్రబాబు కరెంట్ బిల్లు ఇప్పుడు వచ్చే బిల్లు లో సగం కట్టించుకునే విధంగా టిడిపి ప్రభుత్వం వచ్చాక చర్యలు తీసుకుంటారని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్ వి ఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, పోతుల మోహనరావు, పైడిపాల సూరిబాబు, పాలచర్ల సత్యనారాయణ, పోట్రు కృష్ణ, మంగన నారాయణరావు, నంగన శ్రీను, చనిపోయిన లోవరాజు, రాజపూడి గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు, పాల్గొన్నారు.