ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన కేదార్ నాథ్ యాత్రికులకు శుభవార్త. ఇప్పుడు ఆ జ్యోతిర్లింగాన్ని చూడాలంటే ఎంతో కష్టంతో కూడుకున్న ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం గౌరీకుండ్ నుంచి కేదార్ నాథ్ కు 18 కిమీ కాలినడకన లేదా గుర్రాలపైనే వెళ్లాల్సి వస్తోంది. ఆ ప్రయాస లేకుండా మరింత సులభంగా చేరేలా రోడ్డు మార్గం ఏర్పాటు చేసేందుకు ప్లాన్ రెడీ చేశారు అధికారులు. గౌరీకుండ్ నుంచి చౌమాసి వరకు రోడ్డు మార్గం రానుంది. ఇదే దుబాటులోకి వస్తే దూరం 11 కిలోమీటర్లు తగ్గుతుంది. చౌమాసి నుంచి 7 కిమీ మాత్రమే కేదార్ నాథ్ కు కాలినడకన వెళ్లాల్సి వస్తుందన్నారు అధికారులు.
next post