తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత యూనియన్లో హైదరాబాద్ స్టేట్ కలిసిన సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణ జాతీయ సమైక్యతా దినంగా పాటించాలని నిర్ణయించింది. ఆ రోజున నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్లో నిర్వహించే వేడుకల్లో సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేయనున్నారు.
జిల్లా కేంద్రాల్లో సెప్టెంబర్ 17న ఉదయం 9.00 గంటలకు నిర్వహించే కార్యక్రమాల్లో జిల్లా కేంద్రంలలో మంత్రులు, ఇతర ప్రముఖులు జెండాను ఎగురవేయనున్నారు.