తెలంగాణ బీజేపీలో పార్టీ హైకమాండ్ భారీ మార్పులు చేసిన విషయం తెలిసిందే. స్టేట్ చీఫ్గా బండి సంజయ్ను తొలగించి.. కిషన్ రెడ్డిని నియమించింది. అయితే, పార్టీ ప్రెసిడెంట్గా బండి సంజయ్ను తొలగించడంపై రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కేడర్ నుంచి వ్యతిరేకత స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది. ఖమ్మం జిల్లాలో ఓ కార్యకర్త ఏకంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గజ్జల శ్రీనివాస్ అనే వ్యక్తి ఖమ్మం బీజేపీ అర్బన్ టౌన్ ఉపాధ్యక్షులుగా కొనసాగుతున్నారు.
బండి సంజయ్ను రాష్ట్ర అధ్యక్షులుగా తొలగించడంతో తీవ్ర మనస్థాపం చెంది ఉరివేసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. వెంటనే కుటుంబ సభ్యులు గమనించి జిల్లా కేంద్రంలోని శ్రీరక్ష ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పార్టీ జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ ఆసుపత్రికి చేరుకొని పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు.