విద్యా రంగ సమస్యలుపై ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరెట్ల ముట్టడి చేపట్టానున్నారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ముఖ్య కార్యకర్తల సమావేశం ఖమ్మం నగరంలోని స్థానిక సుందరయ్య భవనంలో జరిగింది ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి ప్రవీణ్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ విద్యారంగ
సమస్యలను పరిష్కరించాలని పెండింగ్ లో ఉన్న 5,177 కోట్ల పెండింగ్ స్కాలర్షిప్ లు రియంబర్స్ మెంట్ లను విడుదల చేయాలని రాష్ట్రవ్యాప్తంగా గురుకులాల్లో విలయతాండవం చేస్తున్న సమస్యలను పరిష్కరించాలని పలు విద్యా
రంగంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం కోసం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చామని రాష్ట్రవ్యాప్తంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా విద్యార్థి లోకం విద్యావేత్తలు మేధావులు ప్రజాస్వామికవాదులు అందరూ కూడా ఈ కలెక్టరేట్ ముట్టడిని జయప్రదం చేయాలని విద్యార్థులు సమస్యలు
పరిష్కారం కోసం పెద్ద ఎత్తున కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమానికి పాల్గొనాలని ఆయన తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శులు వీరేందర్ ,సరళ జిల్లా కమిటీ సభ్యురాలు సంగీత, నాయకులు జగదీష్, మహేష్ నరేంద్ర పాల్గొన్నారు.