నరసరావుపేట కేంద్రంగా ఎటువంటి అనుమతులు పొందకుండా నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా అనధికారికంగా శానిటైజర్లు తయారు చేసి అమ్ముతున్న వారిపై తక్షణమే అధికారులు చర్యలు చేపట్టాలని నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద బాబు డిమాండ్ చేశారు.
ఈ రోజు స్థానిక టీడీపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో అరవింద బాబు మాట్లాడుతూ వైస్సార్ సీపీ పాలనలో అవినీతి రాజ్యమేలుతుందని తెలియజెప్పేందుకు నిదర్శనమే నరసరావుపేటలో ఎటువంటి అనుమతులు,నాణ్యతా ప్రమాణాలు లేకుండా అనధికారికంగా శానిటైజర్ల వ్యాపారం విచ్చలవిడిగా జరుగుతుంటే స్థానిక ఎమ్మెల్యే చోద్యం చూస్తున్నారని ఆయన అన్నారు.
అధికారులు కూడా ముడుపులు తీసుకుని నిద్రమత్తులో జోగుతున్నారని తక్షణమే ప్రకాశం జిల్లా కురిచేడులో శానిటైజర్లు తాగి మృతి చెందిన ఘటనలో మృతులు నరసరావుపేట లో శానిటైజర్లు తయారైనవిగా ప్రాథమిక విచారణలో తెలిపారని ఈ ఘటనకు సంబందించి పూర్తి విచారణ జరిపి ఆయా కుంభకోణాలకు కారకులైన వారిని విచారణ జరిపి నిందితులను శిక్షించాలని కోరారు.