నెల్లూరులో ప్రఖ్యాతిగాంచిన చాయ్ బ్రాండ్ సికందర్ టి కార్పొరేట్ ఆఫీసును ప్రముఖ న్యాయవాది మల్లిరెడ్డి కోటారెడ్డి ఆదివారం రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. చైర్మన్ ఛాంబర్ ను రాజీ యాడ్స్ అధినేత అలంకార్ పెంచలయ్య ప్రారంభించారు. సంస్థ బ్రోచర్ ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలిపారు. సికందర్ చాయ్ సంస్థ లోగోను ప్రముఖ వ్యాపారవేత్త చంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆడియో వీడియో ప్రదర్శన జరిగింది. ఈ కార్యక్రమానికి సికందర్ చాయ్ యాజమాన్య సిబ్బంది, ఫ్రాంచైజీల యజమానులు, శ్రేయోభిలాషులు, అభిమానులు హాజరై శుభాకాంక్షలు తెలిపారు.
సికందర్ టి (చాయ్) సంస్థ అధినేత అఖిల్ మాట్లాడుతూ మేము ప్రారంభించిన సికందర్ చాయ్ టీ సెంటర్లు నెల్లూరు ప్రజల అభిమానాన్ని ఎంతగానో పొందాయని సంతోషాన్ని వ్యక్తం చేశారు. నెల్లూరీయులు ఎంతో ఇష్టంగా తాగే టి, సికందర్ అని చెప్పడానికి ఏమాత్రం సంశయం అక్కర్లేదని అన్నారు. నెల్లూరులో 22 శాఖలకు విస్తరించడమే దీనికి ప్రధాన కారణమని పేర్కొన్నారు. ఇంతగా ఆదరణ పొందిన సికందర్ టీ రుచిని ఇతర జిల్లాలకు, పక్క రాష్ట్రాలకు కూడా చూపించాలనే కోరిక ఉందని పేర్కొన్నారు.
ఆ ఉద్దేశంతోనే ఈ బాధ్యతలను మార్కెటింగ్ యువకెరటం, మా డైరెక్టర్ రాహిల్ తాజ్ స్వీకరించారని తెలిపారు. సికందర్ టి అందరి ఆదరాభిమానాలను పొందుతుందనే నమ్మకం ఉందని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఈ సంస్థ డైరెక్టర్ రాహిల్ తాజ్ మాట్లాడుతూ సికందర్ చాయ్ ని అన్ని ప్రాంతాలకు విస్తరించాలనే ఉద్దేశంతోనే ఈ కార్పొరేట్ ఆఫీస్ ను ప్రారంభించామని తెలిపారు. సికందర్ (చాయ్) టీ ఫ్రాంచైజీ కావలసినవారు శాంతినగర్ (బట్వాడి పాలెం) లోని కార్పొరేట్ ఆఫీస్ కు రావాలని, లేదా 7032174231 కు సంప్రదించాలని కోరారు.