ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం బింగిన పల్లి గిరిజన వాడలో దారుణం జరిగింది. ఓ గిరిజన మైనర్ బాలిక పై వాలెంటీర్, ఇద్దరు ఆటో డ్రైవర్ లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. సచివాలయం పక్కన ఉన్న డంపింగ్ యార్డ్ లో కి తీసుకెళ్ళి అత్యాచారం చేశారు. పూటుగా మద్యం తాగి బింగినపల్లి ఎస్సీ కాలనీ కి చెందిన మేదాడి ప్రతాప్, ఆటో డ్రైవర్ మేడిద హరి వాలంటీర్, అల్లాడి వంశీ ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత మహిళ రోదిస్తూ కుటుంబ సభ్యులకు తెలియజేయడం తో పోలీసుల కు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు నిందితులను 24 గంటల లోపు అదుపులో కి తీసుకున్నారు. వాలంటీర్ తో బాటు ఇద్దరు ఆటో డ్రైవర్ ల ను కూడా అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలిని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ముద్దయిల పై, పొక్సో, కిడ్నాప్ ,గ్యాంగ్ రేప్ కు సంబంధించిన సెక్షన్ లు నమోదు చేసినట్లు మీడియా సమావేశంలో ఒంగోలు డి.ఎస్.పి నారాయణస్వామి రెడ్డి తెలియజేశారు.
previous post
next post