సింహాచల దేవస్థానంలో అవినీతి అక్రమాలు జరిగినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో దేవస్థానం ఈవో ఎం వెంకటేశ్వరరావు ను ప్రభుత్వం బదిలీ చేసింది. సింహాచలం దేవస్థానంలో జరుగుతున్న అవినీతి కార్యక్రమాలపై దేవాదాయ శాఖ ఉన్నతాధికారి ఆజాద్ సమర్పించిన నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం దేవస్థానం అధికారులపై క్రమశిక్షణా చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే దేవస్థానం ఈవో ఎం వెంకటేశ్వరరావు పై బదిలీ వేటు వేసింది.
ఆయనతో పాటు దేవస్థానం భూపరిరక్షణ విభాగం ఎస్ డి సి శేషశైలజ, సర్వేయర్ సాయి కృష్ణ లను మాతృ సంస్థకు సరెండర్ చేయనున్నట్లు తెలిసింది. దేవాలయ భూములు చోటుచేసుకున్న అక్రమ నిర్మాణాలకు సంబంధించి అవినీతికి పాల్పడి భూ పరిరక్షణ విభాగంలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు ఏఈవోలు ఒక సూపరింటెండెంట్ గుమస్తా తో పాటు అసిస్టెంట్ ను రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రధాన శాఖకు చేయనున్నట్లు తెలిసింది.