నెల్లూరు జిల్లాలోని సీతారాంపురం తహసీల్ధార్ సతీష్ కుమార్ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు పట్టుబడ్డారు. స్థానిక అయ్యవారిపాళెంకు చెందిన రైతు అంకయ్య తన వ్యవసాయ భూమికి సంబంధించి పాసు పుస్తకాలు కోరగా తహసీల్ధార్ లంచం డిమాండ్ చేశారు.
లంచం ఇవ్వలేదన్న కారణంతో పాసు పుస్తకాల జారీని గత కొద్ది రోజులుగా సతీష్ కుమార్ నిలిపివేశాడు. దీంతో రైతు అంకయ్య ఏసిబి అధికారులను సంప్రదించారు. ఈ క్రమంలో బుధవారం సీతారాంపురంలోని తహసీల్ధార్ నివాసం వద్ద రైతు నుండి 10వేలు లంచం తీసుకుంటుండగా ఏసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.