70 మంది ఏఆర్ సిబ్బంది తో ఏఆర్ డీఎస్పీ శేషాద్రి ఆధ్వర్యంలో బందోబస్తు
పైడితల్లి సిరిమాను ఉత్సవంలో ప్రధాన ఘట్టం సిరిమాను సంబరం మొదలవ్వబోతోంది. సరిగ్గా రెండు గంటలు.. నగరంలో పూజారి ఉంటున్న హుకుంపేట నుంచీ సిరిమాను చెట్టు ను తీసుకువచ్చారు. అక్కడే చదురగుడి వద్ద సిరిమానుపై..పూజారి బంటుపల్లి వెంకట్రావు ను అమ్మవారి రూపంలో కూర్చో బెడతారు.ఇంందుకోసం…సిధ్ధం చేసే పనిలో ఉన్నారు… పూజారి అనుయాయులు. ఇదిలా ఉంటే జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు సిరిమాను వద్దకు వచ్చి… సిరిమాను ను దర్శనం చేసుకొని… ఉత్సవం సజావుగా ప్రారంభించాలని కోరారు
కమాండ్ కంట్రోలర్ నుంచీ పోలీసు బాస్ పర్యవేక్షణ
ఉత్తరాంధ్ర కల్పవల్లి.. విజయనగరం ఇలవేల్పు శ్రీశ్రీశ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం మరి కొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. ఈ క్రమంలో సిరిమాను బందోబస్తు ను పోలీసు బాస్ ఎస్పీ దీపికా… కంట్రోల్ రూం నుంచీ పర్యవేక్షించారు.శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం సందర్భంగా జిల్లా పోలీసుశాఖ చేపట్టిన భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ ఎం.దీపిక, స్వయంగా పర్యవేక్షించారు. కమాండ్ కంట్రోల్ కు అనుసంధానం చేయబడిన సిసి కెమెరా దృశ్యాలను చూస్తూ, సంబధిత అధికారులకు మ్యాన్ పేక్ ద్వారా పలు భద్రతాపరమైన సూచనలు చేశారు.