హైదరాబాద్ లో పని చేస్తూ సమయానికి విధులకు హాజరు కావాలన్న తొందరలో ఇద్దరు యువకులు బాల్కొండ నుంచి హైదరాబాద్ కు బైక్ మీద బయలుదేరారు. హై స్పీడ్ లో వెళ్తుండగా కామారెడ్డి జిల్లా క్యాసంపల్లి శివారు వద్ద బైపాస్ రోడ్డుపై అదుపుతప్పిన బైక్ డివైడర్ ను ఢీకొంది.
ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిజామాబాద్ జిల్లా బాల్కొండకు చెందిన రాహుల్, అతని పెద్దమ్మ కొడుకు రమణ ఇద్దరు హైదరాబాద్ లో ఈఎంఆర్ఐ లో పని చేస్తున్నారు. ఉదయం 5 నుంచి 6 మధ్యలో బైక్ పై విధులకు హాజరు కావాలని బయలు దేరారు. బైక్ పై వెళ్తుండగా అదుపుతప్పి డివైడర్ ను ఢీకొని మృతి చెందారు.
ఇద్దరికి 19 నుంచి 20 సంవత్సరాల వయసు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఇద్దరు కూడా ఇయర్ ఫోన్ వాడుతున్నారని రాహుల్ తన తండ్రికి ఎప్పటికప్పుడు లొకేషన్ షేర్ చేస్తున్నట్టు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.