పవర్ స్టార్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరియు నటసింహం హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలయ్య బాబు మధ్య మంచి సాన్నిహిత్యం ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈమధ్య కాలం లో వీళ్లిద్దరు అనేక సందర్భాలలో కలుసుకున్నారు కూడా. వీళ్ళు కలిసి చేసిన ‘అన్ స్టాపబుల్’ ఎపిసోడ్ కి ఏ రేంజ్ రెస్పాన్స్ వచ్చిందో మన అందరికీ తెలిసిందే. ఇకపోతే దసరా కు నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి విడుదలై ఫ్యామిలీ ఫ్యాన్స్ నుంచే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ మెప్పు పొందుతూ విజయపథంలో దూసుకు పోతోంది.
చంద్రబాబు నాయుడు అరెస్ట్ నేపధ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనూహ్యంగా టీడీపీ తో పొత్తులు కుదుర్చుకోవడం రాబోయే ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలనే నిర్ణయాలు చకచకా జరిగిపోయాయి. ఇందుకు గాను జనసేన,టీడీపీ నేతలు కార్యకర్తలు ఒకరికి ఒకరు సమన్వయం చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనకు చరమ గీతం పలకాలని వ్యతిరేక ఓటు చీల నియవద్దని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఈ నేపధ్యంలో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఓ అడుగు ముందు కేసి బాలయ్య భగవంత్ కేసరి సినిమా విడుదల కు పవన్ కళ్యాణ్ ఫొటోలతో ఫ్లెక్సీలు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఇదే ఉత్సాహంతో జనసేన టీడీపీ ఏపీలో వచ్చే ఎన్నికల్లో వైసీపీ భరతం పట్టి ఉమ్మడిగా అధికారం లోకి వస్తారని ప్రజలు ఆశిస్తున్నారు.