39.2 C
Hyderabad
May 3, 2024 13: 46 PM
Slider కృష్ణ

అత్యాధునిక వసతులతో ప్రాజెక్టులు రావాలి

vellampally

విజయవాడలో ఎస్ వి జె కన్స్ట్రక్షన్స్, లచన్ ఇన్ ఫ్రా సంయుక్తంగా నిర్మించిన కెవిఆర్ కైలాస్ ప్రాజెక్టు ను ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సకల సౌకర్యాలతో KVR కైలాస్ ప్రాజెక్టు రావడం సంతోషదాయకమని అన్నారు.

అత్యాధునిక వసతులను అందిస్తూ  విజయవాడ పరిసర ప్రజలకు చేరువలో మెరుగైన నాణ్యత ప్రమాణాలతో ప్రాజెక్టు రావాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా SVJ కన్స్ట్రక్షన్స్ అధినేత దేవినేని శీహరి, లచన్ ఇన్ ఫ్రా మేనేజింగ్ డైరెక్టర్ మల్లాది కాశీవిశ్వనాధ్ లను మంత్రి అభినందించారు.

ఈ ప్రాజెక్టు విజయవంతంగా లాంచ్ కావడంతో ఇదే స్పూర్తితో ఇటువంటి మరెన్నో ప్రాజెక్టులను అన్ని వర్గాల వారికి చేరువలో నిర్మించాలని కోరారు. ఏపీ అభివృద్దిలో తమ వంతు తోడ్పాటును అందిస్తామని దేవినేని శ్రీహరి, మల్లాది కాశీ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు,  తెలంగాణ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అడిషనల్ ఐజీ మువ్వా వెంకట రాజేష్, విజయవాడ తూర్పు  వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

అంగారకుడిపై కనిపించిన ‘‘నీరు’’

Satyam NEWS

2025 నాటికీ క్షయ రహిత సమాజ నిర్మాణమే ధ్యేయం

Satyam NEWS

సిలెండ‌ర్ల లారీని ఓవ‌ర్ టేక్ చేయ‌బోయి…!

Satyam NEWS

Leave a Comment