సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం లింగగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధి లోని వేపల సింగారం గ్రామంలో సర్పంచ్ అన్నెం శిరీష కొండారెడ్డి క్షయ నిర్ధారణ కేంద్రాన్ని గ్రామ ప్రారంభించారు.
ఈ సందర్భంగా మండల వైద్యాధికారి Dr. లక్ష్మణ్ గౌడ్ మాట్లాడుతూ గ్రామంలో రెండు వారాలకు మించి దగ్గు,జ్వరం, రాత్రిపూట చెమటలు పట్టడం, ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉన్న వారు వెంటనే ఆరోగ్య కేంద్రానికి రావాలని కోరారు.
అలాంటి వారికి క్షయ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు ఇస్తామన్నారు. చికిత్స కాలంలో రోగికి పోషకాహార నిమిత్తం నెలకు 500 రూపాయలను అందిస్తున్నట్లు తెలిపారు.T. B. వ్యాధి మందులు వాడనట్లయితే సంవత్సర కాలంలో 12 నుంచి 15 మందికి వ్యాపి చెందే అవకాశం ఉన్నందున క్రమం తప్పకుండా మందులు వాడాలని అన్నారు.
ఈ కార్యక్రమంలోT. B. నోడల్ పర్సన్ ఇందిరాల రామకృష్ణ, మమత sts, P.సావిత్రి ha(f),అలవాల ఉపేందర్ L.T, ఆశా కార్యకర్తలు మరియమ్మ, జానీబీ, సబిత, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.