అసదుద్దీన్ ఒవైసీ అనుచరులు ‘పాకిస్థాన్ జిందాబాద్’ నినాదాలు చేస్తున్నా తెలంగాణ లోని టీఆర్ఎస్ ప్రభుత్వానికి వినిపించడం లేదని ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. ఈ మధ్య కాలంలో దేశం గురించి దేశ భక్తి గురించి కొంచెం ఎక్కువ మాట్లాడుతున్న తెలంగాణ ఐటి మంత్రి కేటీఆర్ ఈ నినాదాలను ఎందుకు పట్టించుకోవడం లేదని విష్ణువర్ధన్ రెడ్డి ట్విట్టర్లో సూటిగా ప్రశ్నించారు.
అసదుద్దీన్ ఒవైసీ అనుచరులు ‘పాకిస్థాన్ జిందాబాద్’ నినాదాలు చేస్తున్న వీడియోను ఆయన ట్విట్టర్ లో షేర్ చేశారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ అనుచరులు బహిరంగంగా ‘పాకిస్తాన్ జిందాబాద్’ అని నినాదాలు చేస్తున్నా తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియాను ట్విట్టర్లో షేర్ చేశారు.
ఇందులో ఓ భవనం ముందు కొంతమంది ‘పాకిస్థాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేస్తున్నారు. వీరంతా ఓవైసీ అనుచరులని విష్ణువర్థన్ పేర్కొన్నారు. ఇలాంటి వారిపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్నారు. ‘తెలంగాణ ప్రభుత్వం, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ జాతీయవాదం గురించి ప్రతి ఒక్కరికీ పాఠాలు చెబుతారు. కానీ ఇలాంటి వీడియోలు కనిపించినప్పుడు మాత్రం తమ దుర్మార్గపు రాజకీయాలను కొనసాగించడానికి వెంటనే దాక్కుంటారు’ అని ట్వీట్ చేశారు.