26.7 C
Hyderabad
May 12, 2024 08: 32 AM
Slider హైదరాబాద్

అధికారుల వైఖరిపై కరెంటు స్తంభం ఎక్కి నిరసన

#amberpet

తనకు జీవనోపాధి దూరం చేసిన అధికారుల చర్యలకు నిరసనగా ఒక చిరువ్యాపారి కరెంటు స్తంభం ఎక్కిన సంఘటన హైదరాబాద్ లోని అంబర్ పేట నియోజకవర్గంలోని గాంధీ బొమ్మ వద్ద జరిగింది. అక్కడికి దగ్గరలోని  మార్కెట్లో కూరగాయల తోపుడు బండి పెట్ట నివ్వడంలేదని ఒక యువకుడు కరెంటు స్తంభం ఎక్కాడు. ఈ విషయం తెలుసుకున్న బాగ్ అంబర్పేట్ డివిజన్ కార్పొరేటర్ పద్మ వెంకట్ రెడ్డి అక్కడికి వెళ్లి పోలీసు సిబ్బందితో మాట్లాడారు. ఆ యువకుడికి నచ్చజెప్పి కిందికి వచ్చేలా చేశారు. తర్వాత తనకి కావాల్సిన కూరగాయల బండి విషయమై హామీ ఇచ్చారు.

Related posts

రాజ ధర్మానికి విరుద్ధంగా వ్యవహరించిన సంచయిత

Satyam NEWS

ఎక్కడా లేని పథకాలు రాష్ట్రంలోనే అమలవుతున్నాయి

Satyam NEWS

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందించిన కొల్లాపూర్ ఎమ్మెల్యే

Satyam NEWS

Leave a Comment