ఏలూరు జిల్లా పెదవేగి మండలంలో 2020- 2021 సంవత్సరాలకు సంబంధించి కరువు పనులపై సోషల్ ఆడిట్ జరుగుతుందని పెదవేగి ఎం పి పి తాతా రమ్య అన్నారు. శని వారం మండల పరిషత్ కార్యాలయం లో ఎం పి పి సోషల్ ఆడిట్ నిర్వహించే డి ఆర్ పి ల సమీక్షా సమావేశం లో పాల్గొన్నారు. ఈ ఆడిట్ ను నిష్పక్షపాతంగా నిర్వహించాలని పెదవేగి ఎం పి పి ఆడిట్ నిర్వహించే డి ఆర్ పి ల తో అన్నారు.
శనివారం పెదవేగి మండల పరిషత్ కార్యాలయం లో మండలం లో ఉన్న అన్ని పంచాయతీలలో జరిగిన కరువు పనులు సక్రమంగా జరిగాయా లేదా అనే వివరాలు పారదర్శకంగా సేకరించాలని సోషల్ ఆడిట్ నిర్వహించే డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్స్ ను ఎం పి పి ఆదేశించారు.
అయితే గతంలో కొన్ని గ్రామాలలో కరువు పనులలో పాల్గొనని కుటుంబాల తో కరువు పనులలో పాల్గొన్నట్టు నకిలీ మస్టర్ లు వేసి రికార్డులు తారుమారు చేసి కొంతమంది పీల్డ్ అసిస్టెంట్లు కరువు పనులు నిధులు దుర్వినియోగానికి పాల్పడ్డ సంఘటనలు పెదవేగి మండలంలో జరిగాయి.
ఈసారి 2020 -2021 రెండు సంవత్సరాలలో జరిగిన కరువు పనులపై జరిగే ఆడిట్ లో ప్రతి కుటుంబ సభ్యులు కరువు పనుల్లో పాల్గొన్నారా లేదా పాల్గొని ఉంటే పాల్గొన్న రోజులలో కూలి రేట్లు గరిష్టంగా లేదా కనిష్టంగా ఎంటకూలి పడింది. ఎన్ని రోజులు కరువు పనుల్లో పాల్గొన్నారు అనే అంశాల పై క్షుణ్ణంగా ఆడిట్ నిర్వహించాలని ఎం పి పి రమ్య డి ఆర్ పి లకు వివరించారు.
గతంలో వేగివాడ పంచాయతీ లో కరువు పనుల మంజూరైతే ఆ పనులు కె కన్నాపురం చెరువులో నిర్వహించిన సంఘటనలు అప్పట్లో రచ్చకెక్కాయి. కరువు పనుల చేయకుండా కొంతమంది పేరులు మస్టర్ లలో పనులు చేసినట్టు చూపించి అక్రమంగా కూలీల ఎక్కౌంట్ల లో పడిన కూలి డబ్బులు ఫీల్డ్ అసిస్టెంట్లు సగం మాస్టర్ లలో అక్రమంగా చూపించిన కూలీలకు సగం పంచుకున్న ఆరోపణలు పెదవేగి మండలం లో జరిగినట్టు అప్పట్లో ఆరోపణలు వెళ్ళివెత్తాయని తెలిసింది.
కొన్ని చెరువుల లో మట్టి పనులు చేసి గట్లు పోసి వాటిని రోలర్ లతో తొక్కించకుండా తొక్కించినట్టు చూపి, ఆ గట్లపై మొక్కలు నాటకుండా నాటినట్టు చూపి నిధులు దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపణలు కూడా ఉన్నాయి. కరువు పనుల్లో జరిగిన ఇటు వంటి అవకతవకలు, అవినీతి అక్రమాలు సోషల్ ఆడిట్ లో వెలుగు చూసే అవకాశముందని పెదవేగి మండల వెలుగు అసిస్టెంట్ ప్రాజెక్టు ఆపీసర్ హేమలత అన్నారు.
పెదవేగి మండలం లో ఉన్న 30 గ్రామ పంచాయతీలలో ఒక్కొక్క డి ఆర్ పి 2 పంచాయతీలలో ఆడిట్ చేస్తారని మండలం లో 15 మంది డి ఆర్ పి లు ఈ సోషల్ ఆడిట్ ను శనివారం నాడు ప్రారంభిస్తారని, ఫిబ్రవరి 1వతేదీ నాటికి మొత్తము ఆడిట్ వివరాలు పెదవేగి మండల పరిషత్ కార్యాలయం లో జరిగే పబ్లిక్ సోషల్ ఆడిట్ రిపోర్ట్ గ్రామాల వారీగా వెల్లడిస్తారని ఏ పి ఓ శనివారం తెలిపారు.
ఈ ఆడిట్ లో జరిగిన అవకతవకలను, అక్రమాలను, అవినీతిని వెలుగులోకి రాకుండా చేసేందుకు అప్పట్లో విధుల్లో ఉన్న కొంతమంది అధికారులు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. అప్పట్లో కొంతమంది అధికారులు, రాజకీయ నాయకులు ఫీల్డ్ అసిస్టెంట్ల దగ్గర అక్రమ మస్టర్ల ద్వారా సంపాదించిన సొమ్ముల్లో ముడుపులు తీసుకుని చూసీ చూడనట్టు గా వ్యవహరించినట్టు సమాచారం.