37.2 C
Hyderabad
May 6, 2024 13: 38 PM
Slider నల్గొండ

మే డే వేడుకల్లో కానరాని కరోనా దూరం

#NalgondaTRS

నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజక వర్గంలో కార్మిక దినోత్సవ వేడుకల్లో(మేడే) వివిధ పక్షాల నాయకులు సంబరంగా పాల్గొన్నారు. రాష్ట్రంలో, జిల్లాలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతుందన్న భద్రతా భావంలో నాయకులు, కార్మికులు వేడుకలను సంతోషంగా జరుపుకున్నారు.

నియోజకవర్గ కేంద్రంలో శాసనసభ్యుడు చిరుమర్తి లింగయ్య తెరాస కార్మిక జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. కార్మిక సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ పాటు పడుతున్నారని అన్నారు.

చిట్యాల మున్సిపాలిటీ కేంద్రంలో మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకట్ రెడ్డి, తెరాస మండల, పట్టణ శాఖల అధ్యక్షులు జడలు ఆదిమల్లయ్య, బెల్లి సత్తయ్య, వైస్ చైర్మన్ కూరేళ్ల లింగస్వామి, నాయకులు పాటి మాధవ రెడ్డి, గుండెబోయిన సైదులు మేడే ఉత్సవాలలో పాల్గొన్నారు.

సీపీఎం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నాయకులు జిట్ట నగేష్, పామనగుళ్ల అచ్చాలు, నారబోయిన శ్రీనివాస్, కత్తుల లింగస్వామి లు పాల్గొన్నారు. ఇక సీపీఐ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో నాయకులు ఎండి అక్బర్, షేక్ షరీఫ్, బోలుగూరి లింగయ్య, అంజిరెడ్డి, బాల్రెడ్డి లు, తెలుగుదేశం పార్టీ నిర్వహించిన కార్యక్రమంలో బొడిగె విజయకుమార్, ఊడుగు వెంకటేశం, జినుకుల లింగస్వామి లు పాల్గొన్నారు.

Related posts

కరోనా ఎలర్ట్: నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి

Satyam NEWS

మరో సేవ కు శ్రీకారం: మార్చురీ ఫ్రీజర్ లు అందజేయనున్న సోనూసూద్‌

Satyam NEWS

డోనాల్డ్ ట్రంప్ ప్రకటన: ‘‘నేను గెలిచాను’’

Satyam NEWS

Leave a Comment