సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని ఇందిరా గాంధీ సెంటర్ లో ఐ ఎన్ టి యు సి అనుబంధ సంస్థ ఏర్పాటు చేసిన మే డే కార్యక్రమంలో ఐ ఎన్ టి యు సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న గౌడ్ జండా ఎగరవేశారు. అనంతరం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో భాగంగా గౌడ్ మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలు కష్టపడి సాధించుకున్న కార్మిక హక్కులను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నేటికీ నిర్లక్ష్యం చేస్తున్నాయని అన్నారు.
కార్మికులకు నిర్దిష్టమైన జీవిత భద్రత ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేయాలని కోరారు.కార్మిక చట్టాలను మార్చాలని చూస్తే వరకు కార్మిక విప్లవం పాలకపక్షాలు చూడ వలసి వస్తుందని అన్నారు.
మిరప కార్మికులకు, 100 మంది పేదలకు బియ్యం నిత్యావసర వస్తువులు కూరగాయల పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఐ ఎన్ టి యు సి నియోజకవర్గ అధ్యక్షుడు బెల్లం కొండ గురువయ్య, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున్, బాచిమంచి గిరిబాబు, ఐ ఎం పి యు పి మండల అధ్యక్షుడు మేళ్లచెరువు ముక్కంటి, కరుణాకర్ రెడ్డి, జానయ్య, పోతనబోయిన రామ్మూర్తి, ఇంటి అచ్చమ్మ, ములకలపల్లి రామగోపి, కస్తాల శ్రవణ్ కుమార్, రాజు,విజయ వెంకటేశ్వర్లు, సరితా వీరారెడ్డి, తోట లక్ష్మయ్య, దొంతగాని జగన్ ,వెంకన్న తదితరులు పాల్గొన్నారు.