ఈ నెల 27న దేశ వ్యాప్త బంద్ నకు వామపక్ష పార్టీలు పిలుపునివ్వడం హాస్యాస్పదమని బీజేపీ నేత నామమిగంగే రాష్ట్ర సభ్యులు బవిరెడ్డి శివప్రసాద్ రెడ్డి అన్నారు. ఈ మేరకు విజయనగరంలోని లంకాపట్నం వద్ద మాట్లాడుతూ దేశమంతా ఉచితంగా టీకాలు వేస్తూ ,దీపావళి వరకు పేదప్రజలకు బియ్యం గోధుమలు ఉచితంగా ఇస్తూ ,పౌర సత్వ చట్టం సవరణ చేయడం,ఆర్టికల్ 370 రద్ధు ,ముస్లిం మహిళల కోసం త్రిబుల్ తలాక్ రద్దు ,ఒకే దేశం ఒకే వ్యవసాయ మార్కెట్,ఆత్మ నిర్బర్ భారత్, దీర్ఘ కాలంగా పెండింగులోవున్న అయోధ్య రామమందిర నిర్మాణానికి మార్గం సుగమం చేయడం ఓర్వలేక మన దేశంతో దౌత్య సంభందాలు పెంచుకోడానికి అగ్ర దేశాలు మన ప్రధానిని ఆహ్వానిస్తుంటే జీర్ణించుకోలేక చేస్తున్న బంద్ అని అన్నారు. ఈ బంద్ ను ప్రజలు తిప్పికొట్టి ప్రతిపక్షాలకు బుద్ధి చెప్పాలని అన్నారు .ఈ
కార్యక్రమం లొ కుసుమంచి సుబ్బారావు ,ఇమంది సుదీర్ ,ఇప్పిలి గోపాలకృష్ణ ,ఆదీలు ,సోము మహేష్ ,రిక్కా పైడిరాజు తదితరులు పాల్గొన్నారు .