సీనియర్ జర్నలిస్ట్ మారుతి ప్రసాద్ (62) ఆదివారం రాత్రి అకాల మరణం చెందారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
మూడు దశాబ్దాలుగా జర్నలిజంలో ఉన్న మారుతీ ప్రసాద్ సుదీర్ఘ కాలం గుంటూరు ఆపై హైదరాబాద్ లో పని చేశారు.
తొలుత ఈనాడు, ఆపై ఉదయం, వార్త దినపత్రిక లో పనిచేసి ప్రస్తుతం ఫ్రీ లాన్స్ జర్నలిస్ట్ గా పని చేస్తున్నారు.
వీరి మరణం పట్ల మారుతికి అత్యంత సన్నిహితుడైన విజయవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నిమ్మరాజు చలపతి రావు తన ప్రగాఢ సంతాపం తెలిపారు.