ధరణి టీఎం-33 మాడ్యూల్ దరఖాస్తుల పరిష్కారం వేగవంతం చేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టరేట్ లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో తహసీల్దార్లతో ధరణి టీఎం-33 దరఖాస్తుల పరిష్కారంపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మిస్సింగ్ ఎక్స్టెంట్ కరెక్షన్ కు సంబంధించి దరఖాస్తులు పరిష్కారానికి పెండింగులో ఉన్నట్లు తెలిపారు. రికార్డులు క్షుణ్ణంగా పరిశీలించి, అర్హులైన వారి దరఖాస్తుల ఆమోదానికి ప్రతిపాదనలు సమర్పించాలని ఆయన అన్నారు. పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం త్వరితగతిన పూర్తి చేయాలని తహశీల్దార్లను కలెక్టర్ ఆదేశించారు. ఈ సమీక్షలో ఖమ్మం ఆర్డీవో రవీంద్రనాథ్, జిల్లాలోని తహశీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.
previous post