సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పెద్దాసుపత్రి నెఫ్రాలజీ విభాగంలో ఒకే ఒక్క డాక్టర్ ఉండడంతో ప్రజలకు, ముఖ్యంగా వృద్ధులకు తిప్పలు తప్పడం లేదు. వివిధ అనారోగ్య సమస్యలతో ఆసుపత్రికి వచ్చే వారు ఓపి డాక్టర్ లేక అవస్థలు పడుతున్నారు.
కేవలం ఒకే ఒక్క డాక్టర్ ఉండడంతో ఉదయం వెళ్లిన వారు మధ్యాహ్నం ఒంటి గంట వరకు పడిగాపులు కాస్తూ ఎదురుచూడాల్సి వస్తుంది. జిల్లా స్థాయి ఆసుపత్రిలో నెఫ్రాలజీ డాక్టర్ ఒక్కడే ఉండడం, అందరినీ సమయానికి చూడలేకపోవడంతో నడిచే పరిస్థితి కూడా లేని వృద్ధులు నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు.
ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి మరో ఓపి డాక్టర్ ను నియమించి,ప్రజల బాధలు తీర్చాలని కోరుతున్నారు.