సోనూ కౌర్ ను హత్య చేసిన దుండగులను శిక్షించాలని కోరుతూ సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని పొట్టి శ్రీరాములు సెంటర్ నుండి ఇందిరా సెంటర్ వరకు కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించారు. సిక్కు సోదరులు నిర్వహించిన శాంతి కొవ్వొత్తుల ర్యాలీకి సంఘీభావంగా ముస్లిం మైనార్టీ సోదరులు కూడా తమ మద్దతును పూర్తిగా తెలియజేసి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మైనార్టీ రాష్ట్ర నాయకులు ఎండీ అజీజ్ పాషా,జానీ నవాబ్,ఖాసిం డాక్టర్,ముస్తఫా,మున్నా, సలీమ్,భాషా,రసూల్,సలావుద్దీన్, నయీమ్,గౌస్ తదితరులు మాట్లాడుతూ ఈ నెల14వ, తేదీన హైదరాబాద్ శివారులో సోనీ కౌర్ అనే మైనర్ బాలికను కొంతమంది దుండగులు హత్య చేశారని,ఈ హత్యపై పలు అనుమానాలున్నాయని,రాష్ట్ర ప్రభుత్వం దుండగులు ఎంతటి పెద్ద వారైనా సరే తక్షణమే వారిని అరెస్టు చేయాలని,వారి కుటుంబానికి 25లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషన్ ప్రభుత్వం తక్షణమే ప్రకటించి వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చి న్యాయం చేయ్యాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో అనేక మంది సిక్కు సోదరులు,ముస్లిం మైనార్టీ సోదరులు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్