చదువులో ప్రతిభ చూపుతున్న పోలీస్ పిల్లలను ప్రకాశం జిల్లా ఎస్పీ మలిక గర్గ్ నిత్యం ప్రోత్సాహిస్తున్నారు. IIT లో సీటు సాధించిన పోలీస్ పిల్లలకు జిల్లా ఎస్పీ ప్రోత్సాహక చెక్కు అందచేశారు. చదువుల్లో దృఢ సంకల్పం, సరైన ప్రణాళిక, సమయ పాలన మరియు కఠోర కృషితో బంగారు భవితకు బాటలు వేసుకోవాలని ఈ సందర్భంగా ఆమె పిలుపునిచ్చారు. JEE అడ్వాన్స్ పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనపర్చి IIT బాంబే EE కళాశాలలో సీటు సాధించాడు ఒంగోలు దిశ పీఎస్ సీఐ డి. మల్లిఖార్జున కుమారుడు గౌరీ ప్రణీత్ కుమార్. IIT కాన్పూరు కళాశాలలో సీటు సాధించిన కానిస్టేబుల్ యస్.పూర్ణాంజనేయ రాజు (మార్టూరు పీఎస్, బాపట్ల జిల్లా) కుమారై యస్. అనుపమ లను గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి ప్రోత్సాహక నగదుబహుమతి అందచేశారు ఉన్నత చదువుకు మార్గదర్శకంగా తోడ్పడే స్టడీ మెటీరియల్ అందచేసి వారిని శాలువతో ఘనంగా సన్మానించారు.
previous post