37.2 C
Hyderabad
May 6, 2024 11: 12 AM
Slider ఆదిలాబాద్

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో నిర్మల్ ఎస్పీ పర్యటన

#Nirmal SP

ఈ మధ్యనే నిర్మల్ జిల్లాలో మావోయిస్టుల కదలికలు ప్రారంభం కావడం తో ప్రజలకు మనోధైర్యాన్ని ఇవ్వడం కోసం నిర్మల్ జిల్లా ఎస్పీ శశిధర్ రాజు మారుమూల ప్రాంతాలలో పర్యటించారు. మావోయిస్టు వైపు ప్రజల దృష్టి మళ్లకుండా ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని మెసేజ్ కూడా ప్రజలకు ఇచ్చినట్లు అవుతుందని ఆయన ఈ పర్యటన చేపట్టారని అంటున్నారు.

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలను పోలీస్ శాఖ దృష్టిపెట్టి అక్కడి పేదలకు కావలసిన నిత్యావసర వస్తువులను కూడా అందిస్తున్నది. నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని మావోయిస్టు ప్రభావిత మారుమూల ప్రాంతాలు పేంబి మండలం ధూమ్ దరి గ్రామపంచాయతీ పరిధిలోని వస్ పల్లి గ్రామంలో ఆయన నేడు ద్విచక్రవాహనంపై పర్యటించారు. ఊరు పేద అడవి బిడ్డలు లాక్ డౌన్ కారణంగా పనులు లేక తినడానికి తిండి లేక అలమటిస్తున్న సమయంలో 100 నిరుపేద కుటుంబాలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు.

Related posts

పాకిస్తాన్ ప్రధానికి సుప్రీంకోర్టు నోటీసులు

Satyam NEWS

ల్యాండ్ మాఫియా అడ్డా నరేంద్రనగర్ కాలనీ

Sub Editor

సామూహిక అత్యాచారం కేసులో మాజీ మంత్రికి జీవిత ఖైదు

Sub Editor

Leave a Comment