విజయనగరం జిలా కేంద్రంలో సరిగ్గా పదకొండున్నర ప్రాంతం… మయూరీ జంక్షన్ వద్ద…ట్రాఫిక్ జామ్.అ జామ్ లోనే ఓవైపు ఎమ్మెల్యే కోలగట్ల కార్యక్రమం..మరోవైపు స్థానిక పోలీసులకే తెలియకుండా…ఎస్పీ వెహికల్ ఉండిపోవడం..వెరసి…ఓ పావు గంట సేపు గందరగోళం ఏర్పడింది.అసలు విషయం ఏంటంటే…నగరంలోని మయూరీ జంక్షన్,బాలాజీ జంక్షన్ల వద్ద సుందరీకరణపనుల్లో భాగంగా ఎమ్మెల్యే కోలగట్ల వస్తారని…మీడియాకు సమాచారం ఇచ్చారు…వీఎంసీ పీఆర్ఓ. తదనుగుణంగానే మీడియా అంతా మొదట బాలాజీ జంక్షన్ వద్ద ఎమ్మెల్యే కార్యక్రమాన్ని కవర్ చేసింది.
అక్కడ నుంచీ నేరుగా కాంప్లెక్స్ సమీపంలోని మయూరీ జంక్షన్ కు ఎమ్మెల్యేతో పాటు మీడియా చేరుకుంది.అక్కడే ఫౌంటెన్ నిర్మించేందుకు మున్సిపల్ కమీషనర్,ఇంజనీర్లతో పాటు ట్రాఫిక్ పోలీసులతో ఎమ్మెల్యే చర్చిస్తున్నారు.ఈ క్రమంలోనే అనుకున్న సమయం ప్రకారం..సమీపంలో ఉండే బంగ్లా నుంచీ ఎస్పీ దీపికా జిల్లా పోలీస్ కార్యాలయానికి బయలు దేరేందుకు సన్నద్దం అయ్యారు.
ముందుగానే మేన్ ప్యాక్ ద్వారా..బంగ్లాలో సెక్యురిటీ సిబ్బంది. ట్రాఫిక్ సిబ్బందిని అలెర్ట్ కూడా చేసారు.అయితే అదే సమయంలో మయూరీ జంక్షన్ వద్ద ఎమ్మెల్యే ప్రోగ్రామ్ లోకాస్త బిజీబీజీ గాఉండటంతో…ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో మయూరీ నుంచీ వచ్చే ఎస్పీ వెహికల్…ఆ ట్రాఫిక్ జామ్ లోనే ఇరుక్కుపోయింది.
ఒకానోక సమయంలో ఎస్పీ గన్ మేన్ ఇక దిగి ట్రాఫిక్ ను క్రమబద్దీకరించుదామని సిద్దపడేలోగా మేన్ ప్యాక్ ద్వారా వచ్చిన అలెర్ట్ తో తేరుకున్న ట్రాపిక్ సిబ్బంది అయిన ఎస్ఐ దామోదరరావు,ఏఎస్ఐ నూకరాజు..సిబ్బంది సింహాచలంలు వెనువెంటనే ట్రాఫిక్ నుక్రమబద్దీకరించి ఎస్పీ మేడం వెహికల్ ను లైన్ క్లియర్ చేయడంతో సర్వీసు లైన్ నుంచీ ఎస్పీ వెహికల్ డీపీఓకు బయలుదేరి వెళ్లింది.