రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల, యువజన సర్వీసుల మరియు క్రీడా శాఖ మంత్రి ఆర్.కె. రోజా కంటి ఆపరేషన్ చేసుకున్న వారిని గురువారం పరామర్శించారు. రోజా చారిటబుల్ ట్రస్ట్ మరియు శంకర్ నేత్రాలయ ఆస్పత్రి చెన్నై వారి ఆధ్వర్యంలో నగరి లోని మంత్రి కార్యాలయంలో గత నాలుగు రోజులుగా సుమారు 1,000కి పైగా రోగులకు కంటి పరీక్షలు నిర్వహించారు. మొదటి విడతగా 50 మందికి శస్త్రచికిత్సలు నిర్వహించారు. ఆపరేషన్ చేసుకున్న వారిని మంత్రి రోజా గురువారం పరామర్శించారు. కాగా మంత్రి కార్యాలయం లో ఏప్రిల్ 10వ తేదీ సోమవారం వరకు ప్రతి రోజు 250 మందికి కంటి పరీక్షలు చేయడంతో పాటు 50మంది వరకు కంటి పోర ఆపరేషన్లు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
previous post