భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ హేమచంద్రాపురం నందు నూతనంగా శిక్షణ కొరకు సిద్ధం చేస్తున్న మైదానాన్ని జిల్లా ఎస్పీ డా.వినీత్ సందర్శించారు. శిక్షణ, పరేడ్ కొరకు పోలీస్ అధికారులకు, సిబ్బందికి అవసరమైన అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్ వంటి స్పోర్ట్స్ నకు సంభందించిన అన్ని రకాల క్రీడా వసతులను కూడా అతి త్వరలో ఏర్పాటు చేస్తామని అన్నారు. అతి తక్కువ సమయంలో సుందరంగా మైదానాన్ని తీర్చిదిద్దిన ఏఆర్ అధికారులను ఈ సందర్భంగా ఎస్పీ అభినందించారు.
previous post