ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచార రథం సిద్దం అయింది. అధినేత చిత్రం, కారు గుర్తు, భారతదేశ పటం, గులాబీ రంగు గుభాళింపుతో సర్వాంగ సుందరంగా ప్రచార రథం ముస్తాబైంది. 2023 అసెంబ్లీ ఎన్నికల కోసం బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ కు యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఈ వాహనాన్ని నజరానాగా ఇచ్చారు. కొద్ది రోజుల క్రితం ఉత్తర ప్రదేశ్ నుంచి తెలంగాణాకు ఈ బస్సు చేరింది. నేటి నుంచి మొదలయ్యే కేసీఆర్ ప్రచార పర్వంలో తెలంగాణా రోడ్లపై ఈ ప్రచార రధం పరుగులు పెట్టనున్నంది. ప్రచార రథం ఇవాళ హుస్నాబాదుకు చేరుకుంటుంది.
previous post
next post